Saturday, February 22, 2025

అదుపుతప్పి కాలువలో పడ్డ బస్సు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ నగర్ జిల్లా ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో శుక్రవారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా చాలా మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం సహయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News