Friday, October 18, 2024

పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సు, పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఉన్నావ్ జిల్లా బంగార్‌మౌ ప్రాంతంలోని జోజికోట్ గ్రామ సమీపంలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 5.15 గంటలకు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ బయటకు తీసి చికిత్స నిమిత్తం సిహెచ్‌సి బంగార్మావుకు తరలించారు. కాగా, ప్రాథమిక విచారణలో బస్సు అతివేగంగా దూసుకురావడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News