ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపు
ఫిరాయింపుదారులను రక్షించడం కాంగ్రెస్కు అసాధ్యం
ఆ ఏడుగురిపైనా వేటు వేయాలంటూ సుప్రీంలో కెటిఆర్
పిటిషన్ అంతకుముందు దాఖలైన పిటిషన్కు జత చేసిన సుప్రీం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎ న్నికల కోసం బిఆర్ఎస్ కార్యకర్త లు సిద్ధంగా ఉండాలని కెటిఆర్ ఎ క్స్ వేదికగా పార్టీ శ్రేణులకు సూచించారు. రాజ్యాంగం నిర్దేశించిన చ ట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యమని వెల్లడించారు. అయితే సు ప్రీంకోర్టులో ఫిబ్రవరి 10న పార్టీ ఫి రాయింపు ఎంఎల్ఎల అనర్హతపై విచారణ జరగనున్న నేపథ్యంలో కె టిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రసు తం హాట్ టాపిక్గా మారాయి.
కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత అధి కార కాంగ్రెస్లో చే రిన ఎంఎల్ఎ లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బిఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్కు కెటిఆర్ వేసిన పిటిషన్ను ధర్మాసనం జత చేసింది.
కెటిఆర్ వేసిన పిటిషన్ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెం కట్రావుల అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వేయాల ంటూ బిఆర్ఎస్ ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్పై రెండ్రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎంఎల్ఎలపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ప్రశ్నించింది. పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎంఎల్ఎలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ వేసిన సంగతి విదితమే.