Friday, September 20, 2024

మితిమీరిన అప్పులు

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్ శాఖకు పన్ను చెల్లింపులో రూ.77 కోట్ల అక్రమాలు
ఎక్సైజ్ శాఖను ఎండగట్టిన కాగ్ నివేదిక
అవకతవకలన్నీ 2017-22 మధ్య జరిగినట్లు తనిఖీల్లో గుర్తింపు
179 కేసులకు సంబంధించి పన్నులు తక్కువ, ఆలస్యంగా చెల్లించిన వైనం
ఎక్సైజ్ సూపరింటెంట్ కార్యాలయాల్లో అపరాధ రుసుంలో అధికారులు నిర్లక్ష్యం
తాజాగా కాగ్ నివేదికలో స్పష్టమైన అక్రమాలు వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో గడిచిన నాలుగైదు ఏళ్లుగా జరిగిన అక్రమాలను కాగ్ ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. తాజాగా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు పన్ను చెల్లింపు విషయంలో రూ.77 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టంగా వెల్లడిం చింది. అవకతవకలు అన్నీ 2017-22 మధ్య జరిగినట్లు తనిఖీల్లో గుర్తించామని తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పని తీరుపై కాగ్ మండిపడింది. దాదాపు 179 కేసులకు సంబంధించి ఎక్సైజ్ శాఖను ఎండగట్టిన కాగ్ పన్నులు తక్కువ చెల్లించడం, ఆలస్యంగా చెల్లించినా అపరాధ రుసుం వసూలు చేయకపోవడం చేశారని వెల్లడించింది.

అలాగే అసలు పన్నులే చెల్లించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదని చెప్పింది. రాష్ట్రానికి నివేదిక ఇచ్చిన అనం తరం ఎక్సైజ్ శాఖ 11 కేసుల్లో రూ.11లక్షలు వసూలు చేసి నట్లు కాగ్ తెలిపింది. 2018 డిసెంబరు నుంచి 2022 మార్చి మధ్య 6 ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరి ధిలో అపరాధ రుసుం చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కాగ్ తెలిపింది. 46 బార్ అండ్ రెస్టారెంట్లు తమ లైసెన్సుల పునరుద్ధరణ రుసుం, వార్షిక బార్ ఎక్సైజ్ పన్ను చెల్లింపుల విషయంలో ఆలస్యం చేసినట్లు తెలిపింది. అయితే వారికి రూ. 71 లక్షల అపరాధ రుసుము విధించకుండా అధికారులు వదిలేసినట్లు నిగ్గు తేల్చింది.

ఈ అంశాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందని లేదని చెప్పింది. సికింద్రాబాద్ డీపీఈవో కార్యాలయ రికార్డులను 2022 ఫిబ్రవరిలో ఆడిట్ చేస్తున్న సమయంలో రెండు బార్లు రూ.24లక్షలు చెల్లించని విషయం తమ దృష్టికి వచ్చినట్లు కాగ్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రెండు బార్లు వార్షిక ఎక్సైజ్ పన్ను చెల్లించలేదని, వసూలు చేసేందుకు చర్యలు తీసు కుంటామని డీవీఈవో చెప్పారని తెలిపింది. దీనిపై 2022 నవంబర్ లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పం దించలేదని చెప్పింది. 2017- 18, సంవత్సరాలకు సంబంధించి మేడ్చల్ డిస్టిలరీస్ ఎక్సైజ్ పన్ను చెల్లింపులో ఆలస్యం చేసినా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. ఆలస్యం చేసినందుకు విధించాల్సిన రూ.86.99 లక్షల అపరాధ రుసుం ను సైతం ఎక్సైజ్ శాఖ విధించలేదని తెలిపింది.

ఈ విషయం 2022 జన వరిలో రికార్డులు పరిశీలించిన సమయంలో గుర్తించినట్లు కాగ్ పేర్కొంది. శంషాబాద్ డీపీఈవో పరిధిలో 12 మంది బార్ లైసెన్సుదారుల పైనా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని కాగ్ తన నివేదికలో తెలిపింది. 2019 జనవరి నుంచి 2020 నవంబర్ వరకూ పన్ను చెల్లింపు విషయంలో వారు ఆలస్యం చేసినా విధించాల్సిన రూ. 10.44 లక్షల అవరాధ రుసుం విధించలేదని వెల్లడించింది. 2022 మార్చిలో ఖమ్మం, మహబూబాబాద్ డీపీ ఈవోల పరిధిలో ఏడైట్ బార్లకు సంబంధించి ఆడిట్ చేశామని, అయితే మూడు కార్లు రూ.12ల క్షల ఎక్సైజ్ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ తక్కువగా చెల్లిం చినట్లు గుర్తించామని కాగ్ తన నివేదికలో స్పష్టంగా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News