రూ.కోటిపైగా విలువైన 273
కిలోల గంజాయి స్వాధీనం
ఒడిశా నుంచి హర్యానాకు
తరలిస్తుండగా వలపన్ని
పట్టుకున్న పోలీసులు
ఒఆర్ఆర్పై నిందితులను
అదుపులోకి తీసుకున్న
శామీర్పేట పోలీసులు
మనతెలంగాణ/శామీర్పేట: ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే సంస్థ పేరుతో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా, శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం శామీర్పేట పోలీస్ స్టేషన్లో డి సిపి కోటిరెడ్డి మీడియా సమావేశంలో వివరాల ను వెల్లడించారు. బోయిన్పల్లికి చెందిన ప్రదీప్ కుమార్ తన బొలేరో వాహనాన్ని ప్యాకర్స్ అండ్ మూవర్స్ పని కోసం ఉపయోగిస్తూ ఉండేవా డు. అదే ప్రాంతానికి చెందిన సన్నీ, మనీష్ కుమార్ అతనికి పరిచయమయ్యారు. దీంతో బొలెరో వాహనానికి డ్రైవర్గా సన్నీ, హెల్పర్గా మనీష్ కుమార్ పని చేస్తున్నారు.
గత నెల 31న ప్రదీప్ కుమార్ హర్యానా రాష్ట్రానికి చెందిన సా హిల్ తో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడ సు భాష్ అనే వ్యక్తిని కలిసి 273 కిలోల గంజాయి ని రూ.లక్షా 30 వేలు చెల్లించి కొనుగోలు చేశా రు. ఒడిశా నుండి హర్యానాకు తెలంగాణ రా ష్ట్రంమీదుగా హర్యానా, పంజాబ్కు చెందిన ము గ్గురు వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్నారని పక్కా సమాచారం పోలీసులకు అందింది. శనివారం శామీర్పేట ఓఆర్ఆర్ వద్ద ఎస్ఓటి, శామీర్పేట పోలీసులు, సైబరాబాద్ బృందం సంయుక్తంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయిని పట్టుకొని నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 273 కిలోల గంజాయి, బొలెరో వాహనం, మొబైల్ ఫోన్లు, జియో డంగిల్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. కాగా, గంజాయ అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 9490617444 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డిసిపి కోటిరెడ్డి ప్రజలను కోరారు.