Sunday, February 23, 2025

ఖమ్మంలో చెట్టును ఢీకొట్టిన కారు

- Advertisement -
- Advertisement -

బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్లలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు సూర్యనారాయణ, రుక్మిణిగా పోలీసులు గుర్తించారు. బాధితులు ఖమ్మంలోని మామిళ్లగూడెం వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన కాసేపటి తరువాత కారులో మంటలు చెలరేగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News