- Advertisement -
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్ హైదర్షా కోట వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున సన్ సిటీ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా.. పొగమంచు కమ్ముకోవడంతో రహదారి సరిగా కనిపించక ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Car hits divider in Rajendra Nagar
- Advertisement -