కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వద్దకు మం త్రి కొండా సురేఖ వ్యవహారం చేరింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎంఎల్ఎలు దీపాదాస్ మున్షీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అన్ని ని యోజకవర్గాల్లో కొండా వర్గం జోక్యం చేసుకుంటుందని సదరు ఎంఎల్ఎలు, డిసిసి చీఫ్లు దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల పరకాల నియోజకవర్గంలో గొడవ జరిగి న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఎంఎల్ఎలు ముక్తకంఠంతో దీపాదాస్ మున్షీకి కోరినట్లు సమాచారం. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కొండా సురేఖ జోక్యాన్ని ఎంఎల్ఎలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.
కొండా సురేఖ దూకుడుకి కళ్లెం వేయాల్సిందేనని సదరు ఎంఎల్ఎలు భావించినట్లు సమాచారం. దీంతో ఈ విషయమై పార్టీ పెద్దల దృష్టికి చేరవేస్తే ఫలితం ఉం టుందని వారు భావించినట్లుగా చెబుతున్నారు. ఇదే క్రమంలో మంగళవారం కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి కొండా సురేఖ వ్యవహారంపై పూర్తిస్థాయిలో వివరించారు. ఇదే వ్యవహారంపై బుధవారం పిసిసి చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ని కలిసి కూడా ఆ ఎంఎల్ఎలు ఫిర్యాదు అందజేయనున్నారని సమాచారం.