సమస్య చెప్పుకునేందుకు పోలీస్ స్టేషను వచ్చి న యువతిని, న్యాయం చే స్తానని లో బర్చుకుని గర్భవతిని చేశాడు ఓ ఖాకీచకుడు. బాధితురాలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కేసు న మోదు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సదరు కానిస్టేబుల్ను రి మాండ్కు తరలించారు. మేడ్చల్ జోన్ ఎసిబి బి.శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకా రం.. మేడ్చల్ ఇందిరానగర్ కాలనీలో ఉండే యువతి (31) డబ్బుల విషయమై తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారం టూ ఫిర్యాదు చేసేందుకు గతేడాది మార్చి 21న త న తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. క్రైమ్ విభాగంలో కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి వారి సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి తన సెల్ ఫోన్ నంబర్ను యువతికి ఇచ్చాడు.
ఇంటికి పిలిచి పలుమార్లు అఘాయిత్యం
మర్నాడు తన కేసు విషయమై యువతి కానిస్టేబుల్కు ఫోన్ చేసింది. లాయర్తో మాట్లాడదామం టూ ఆమెను తన ఇంటికి రప్పించి మాటల్లో పెట్టి, తనకు పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరోసారి కూడా ఇంటికి ర ప్పించుకుని ఇలాగే చేశాడు. యువతి గతేడాది జూలైలో గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలో ఆగస్టు 15న యువతి సుధాకర్ రెడ్డికి ఫోన్ చేయగా అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. దీంతో అతడికి పెళ్లయిన విషయం సదరు యువతికి తెలియడంతో కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని నిలదీసింది.
ఆమె కారణంగా తన కుటుంబంలో గొడవలు తలెత్తాయని భావించి న సుధాకర్ రెడ్డి యువతి అడ్డు తొలగించుకునేందుకు మేడ్చల్లోని ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు. అనంతరం సుధాకర్ రెడ్డి దంపతులు సదరు యువతిని ఇంటికి పిలిపించుకు ని దాడి చేశారు. అలాగే, తన మిత్రుడైన మరో కానిస్టేబుల్ ద్వారా సుధాకర్ రెడ్డి యువతిని బెదిరింపులకు గురిచేశాడు. డిసెంబర్ 16న సుధాకర్ రెడ్డి తన బండిపై యువతిని తీసుకెళ్లి గిర్మాపూర్ సమీపంలో బండి మీద నుండి కిందికి తోసేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
కానిస్టేబుల్ వ్యవహారం గురించి తెలిసి మేడ్చల్ ఇ న్స్పెక్టర్ సత్యనారాయణ అతడిని సైబరాబాద్ కమిషనరేటుకు బదిలీ చేయించారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఈ నెల 3న బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసిం ది. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు.