మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత చక్రధర్గౌడ్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని బాచుపల్లి పోలీసులు బిఆర్ఎస్ నేత హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సహా మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని బాచుపల్లి పోలీసులను చక్రధర్ గౌడ్ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సంతోష్ కుమార్, హరీష్ రావు, రాములు, వంశీలపై కేసు నమోదైంది. బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం హరీష్ రావు పై 351 (2) R/W 3, (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఎ-1 వంశీ కృష్ణ, ఎ3 సంతోష్ కుమార్, ఎ4గా పరుశురాములు పేర్లను చేర్చిన పోలీసులు ఎ2గా హరీష్ రావు పేరు చేర్చారు. గతంలో హరీష్ రావుపై చక్రధర్గౌడ్ ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి తన భార్యతో, బంధువులతో జరిపిన ఫోన్ సంభాషణలను విన్నారని, కోర్టు చర్యలు తీసుకోవాలని పోలీసులతో పాటు న్యాయస్థానాన్ని సైతం చక్రధర్ గౌడ్ ఆశ్రయించడం తెలిపిందే. తాజాగా హరీష్ రావు సహా కొందరి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.