Sunday, September 8, 2024

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వివేకాహత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శుక్రవారం మధ్యంతర ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు సిబిఐ వెల్లడించింది. శుక్రవారం సిబిఐ ఛార్జిషీటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యంతర ఛార్జిషీటులో జగన్, అవినాష్ రెడ్డి పేర్లు ప్రస్తావించనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. దర్యాప్తునకు మరింత గడువు కావాలని జులై3వ తేదీనే సుప్రీంకోర్టును కోరాలని సిబిఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జులై 3న సిజెఐ ధర్మాసనం ముందు అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తు వివరాలన్నింటినీ సిబిఐ ఛార్జిషీటులో ప్రస్తావించనుంది. కుట్ర కోణం వెలుగులోకి తెచ్చేందుకు మరింత గడువు కావాలని సిబిఐ సుప్రీంకోర్టును కోరనుంది. వివేకా హత్య కేసులో కడప వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి ఆదివారం కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు.

తనతో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్‌ను తీసుకు వచ్చారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకురావాలని శనివారమే అధికారులు చెప్పారు. దీంతో డాక్యుమెంట్స్‌తో సిబిఐ కార్యాలయానికి వచ్చిన ఆయన ఇరవై నిమిషాలు ఉండి తిరిగి వెళ్లిపోయారు. కాగా అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. జూన్ నెల చివరి వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం అవినాష్‌కు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటలకు సిబిఐ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా ఇప్పటికే అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News