Sunday, February 23, 2025

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదు

- Advertisement -
- Advertisement -

పాట్నా: మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ సారథ్యం లోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయదని, కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్థి పొందేందుకే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. బిల్లు అమలు చేసే ఉద్దేశం అంటూ ఉండే గతం లోనీ ఆ పనిచేసేవారుఅని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

మహిళలకు రిజర్వేషన్ కల్పించడం తప్పనిసరి అని , మొదట్నించీ తాము దీనికోసం డిమాండ్ చేస్తూనే ఉన్నామని, అయినా వాళ్లు ( కేంద్రం) ఈ బిల్లును అమలు చేయలేదని నితీష్ అన్నారు. కుల ఆధార జనగణన చేపట్టాలని తాము చాలాకాలంగా కోరుతూనే ఉన్నామని, ఇప్పటికీ ఇది తమ డిమాండ్‌గా ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News