Saturday, February 22, 2025

విమానంలో చిరు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు గురువారం వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. గురువారంతో వారి పెళ్లి జరిగి 45 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన భాగస్వామి సురేఖకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకను ఈ జంట విమానంలో ప్రయాణం చేస్తూ జరుపుకోవడం విశేషం. వారు దుబాయ్‌కి ప్రయాణిస్తున్న విమానంలో తమ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, అమల, నమ్రత ఘట్టమనేని తదితరులు పాల్గొని చిరంజీవి, సురేఖలకు పుష్పగుచ్ఛాలు అందజేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక తన జీవితానికి వెలుగు తీసుకొచ్చిన తన భార్య, తన వెనకాల ఉండి ఎంతో బలాన్ని, ధైర్యాన్ని అందించిందని.. ఆమె తన జీవితంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంటూ చిరు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక తమ వివాహ వార్షికోత్సవ వేడుకకు సంబంధించిన ఫోటోలను చిరు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయగా, అభిమానులు సైతం వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News