Sunday, February 23, 2025

ఇద్దరు బాలురు మధ్య ఘర్షణ.. కోపంలో కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఫలక్ నుమా పరిధిలో ఇద్దరు బాలురు మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న బాలుడికి బైక్ తగలడంతో ఘర్షణ మొదలైంది. బైకుపై వెళ్తున్న బాలుడు కత్తితో దాడి చేశాడు. కత్తి దాడిలో మరో బాలుడికి స్పల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫలక్ నుమా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News