Sunday, April 13, 2025

రెండోసారి అసెంబ్లీ ఆమోదిస్తే అదే ఫైనల్

- Advertisement -
- Advertisement -

ఆ బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో పెట్టడం చట్టవిరుద్ధం
రాష్ట్రపతికీ సిఫారసు చేయకూడదు ఒకవేళ చేయదల్చితే నెలరోజులలోపు
నిర్ణయం తీసుకోవాలి రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం లేదంటే
మూడు నెలల్లో ఆమోదించాలి సుప్రీంకోర్టు స్పష్టీకరణ తమిళనాడు
గవర్నర్ తీరుపై గరం..గరం

న్యూఢిల్లీ : తమిళనాడులో గవర్నర్ వద్ద బి ల్లుల పెండింగ్ అంశంలో డీఎంకే ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించిం ది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేర ని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిం ది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో ఉంచడం చట్ట విరుద్ధమం టూ తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్‌ఎన్ రవికి తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. “ 10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలన్న గవర్నర్ చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షం, గవర్నర్ బిల్లును పునః పరిశీలనకు వెనక్కి పంపాక, అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత రెండోసారి ఆ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేయకూడదు. అలా చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టుగానే పరిగణించాలి. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే నెలరోజుల్లోపై గవర్నర్ దానిపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదనుకుంటే 3 నెలల్లోపు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ శాశ్వతంగా వాటిని తమ వద్ద ఉంచుకోలేరు ” అని సుప్రీం ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

రాజ్యాంగం లోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును పాస్ చేసి ఆమోదం కోసం పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయడం, సమ్మతిని నిలుపుదల చేయడం, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, పునః పరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం వంటివి చేస్తారు. తర్వాత మళ్లీ సభ దానిని ఆమోదిస్తే … గవర్నర్ సమ్మతితో నిలిపివేయలేరు. కానీ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేయవచ్చు. రాజ్యాంగానికి, ప్రభుత్వ విధానాలకు , జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు విరుద్ధంగా ఉందని భావిస్తే … ఆ విధంగా రిజర్వ్ చేసే వీలు ఉంటుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవికి పంపగా, ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచేసుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై 2023లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పునః పరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలో ఆయన తీరు మారడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజాగా సుప్రీం తీర్పు వెలువరించింది. “ తమిళనాడుతో పాటు రాష్ట్రాలన్నింటికి ఇది భారీ విజయం” అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు.

గవర్నర్లపై సుప్రీం తీర్పు అన్ని రాష్ట్రాలకు పెద్ద విజయం : స్టాలిన్
రాష్ట్ర బిల్లులపై గవర్నర్ పాత్రకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదని, ఇది అన్ని రాష్ట్రాలు సాధించిన విజయమని అన్నారు. సుప్రీం కోర్టు నుంచి తమిళనాడు ప్రభుత్వానికి లభించిన ఊరటపై అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ , సుప్రీం కోర్టు తీర్పుతో గవర్నర్ నిలిపి ఉంచిన బిల్లులన్నీ ఇప్పుడు ఆయన ఆమోద ముద్ర పడి చట్ట రూపం దాలుస్తాయని చెప్పారు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ కాదనలేరని రాజ్యాంగం చెబుతోందని , అయితే ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతోపాటు ఎడతెగని జాప్యం చేస్తూ వచ్చారని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News