Sunday, September 8, 2024

పిఎస్‌ఎల్వీ -58 ప్రయోగం సక్సెస్‌పై సిఎం రేవంత్ హర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాకెట్ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలను ఆయన అభినందించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ సిఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా తర్వాత బ్లాక్‌హోల్స్‌ను అధ్య యనం చేయడానికి అబ్జర్వేటరీ ఉప గ్రహం ఉన్న రెండో దేశంగా భారత్ అవతరించిందని కొనియాడారు. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో రోదసీలో భారత పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. ఈ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరిందన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News