Tuesday, April 29, 2025

వరంగల్ బయలుదేరిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

వరంగల్ జిల్లాలో సిఎం జన జాతర సభకు సర్వం సిద్ధం అయింది. హనుమకొండ జిల్లా మడికొండలో జనజాతర బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోరుతూ సభ ఏర్పాటు చేశారు. జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క హాజరుకానున్నారు. సిఎం పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సిఎం వరంగల్ కు బయలుదేరారు. అటు వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ వేశారు కడియం కావ్య. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News