Sunday, April 27, 2025

గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. జూన్ 2వ తేదీ ఆదివారం తెంగాణ దశాబ్ది వేడుకలను సర్కార్ వైభవంగా నిర్వహిస్తుంది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న దశాబ్ది సంబురాల్లో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News