Friday, August 30, 2024

మూడు దశల్లో రుణ విముక్తి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. గురువారం(జు లై 18) సాయంత్రం 4 గంటలకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి వెళుతుందన్నారు. ప్రతి రైతుకు రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ల క్ష్యమని సిఎం స్పష్టం చేశారు. ప్ర జాభవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూ టీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రు లు, ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గడిచిన ఏడు నెలల పాలనపై సమీక్షించారు. గురువారం లక్ష రూపాయల వరకు రైతు రు ణాలకు నిధులు విడుదల చేస్తామని, ఈ నెలాఖరులో పు రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ జరుగుతుందని సిఎం చెప్పారు. ఆగస్టులో రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపా రు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉం ద ని, చిత్తశుద్ధితో ఒకే విడతలో రూ.2 లక్షల రుణమా ఫీ చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని అన్నారు. వ్యవసాయ వి ధానంలో తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలని చెప్పారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఇది అని పేర్కొన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అని వెల్లడించారు.

కెసిఆర్ లాగా రైతులను మభ్యపెట్టడం లేదు
రుణమాఫీ పేరుతో కెసిఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అని ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు వివరించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండని, దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత మొత్తంలో మాఫీ చేయలేదు : దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని సిఎం పేర్కొన్నారు. రుణమాఫీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని అన్నారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని అన్నారు. ఆర్ధిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని, ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అని పార్టీ నాయకులను, శ్రేణులను ఉద్దేశించి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించాలని చెప్పారు. గురువారం గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎంఎల్‌ఎలు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబురాలు జరగాలని అన్నారు. ఏడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News