ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్, పద్మ విభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్ మృతి పట్ల సిఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా రంగంలో కస్తూరి రంగన్ విశేష సేవలు అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్మన్గా, ముఖ్యంగా పిఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఆయన పోషించిన పాత్ర దేశం మరిచిపోదని సిఎం పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, జేఎన్యూ వైస్ ఛాన్స్లర్గా, కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా అనేక పదవుల్లో విశేష సేవలు అందించిన డాక్టర్ కస్తూరి రంగన్ మృతి దేశానికి లోటని, ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్తను దేశం కోల్పోయిందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని సిఎం రేవంత్ ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతిని తెలియజేశారు.
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి సంతాపం
- Advertisement -
- Advertisement -
- Advertisement -