Thursday, September 19, 2024

ఒక్క రైతుతో చెప్పించినా రాజకీయాలు వదిలేస్తా:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రైతు రుణమాఫీ 40 శాతం మాత్రమే చేశారని బిఆర్‌ఎస్ క్యార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో కెటిఆర్, ఇతర సీనియర్ పార్టీ నేతలు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రుణమాఫీలో సవాలక్ష కొర్రీలు, ఆంక్షలు పెట్టారని, రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేశారని ఆయన ధ్వజ మెత్తారు. రైతు రుణమాఫీ పైన తాను సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సిఎం రేవంత్‌రెడ్డి చేసిన రుణమాఫీ నిజమైతే, కొడంగల్ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దామన్నారు. ఒక్క రైతు వేదికలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని కెటిఆర్ సవాల్ విసిరారు. సిఎంకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రుణమాఫీలో డిసెంబరు 9 నుంచి ఆగస్టు 15 వరకు జాప్యం చేశారని పేర్కొన్నారు.

బ్యాంకు లకు 9 నెలల వడ్డీ ఎవరు కడతారు? అని ప్రశ్నించారు. 22.37 లక్షల మంది రైతులకు రూ.17,934 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని వెల్లడించారు. తాము ఉన్నప్పుడు రుణమాఫీ చేశామని, రైతుబంధు వేశామన్నారు. వర్షాకాలం రైతుభరోసా రూ.14 వేల కోట్లు ఇంకా ఇవ్వలేదని, మొన్న యాసంగీలో రూ.4 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు. వైరాలో రేవంత్‌రెడ్డి ప్రసంగం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. రుణమాఫీ సగం కూడా చేయకుండా సంపూర్ణంగా చేశామనడం మోసమని ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ, అధికారులు లేకుండా గ్రామాలకు వెళ్తే రైతులే కొడతారని ఆయన వ్యాఖ్యనించారు. హరీశ్‌రావు రాజీనామా చేయాలని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, వందశాతం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని హరీశ్‌రావు అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు, విధానం లేదని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News