- Advertisement -
రాష్ట్ర ప్రజలందరికీ సిఎం ఎ.రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని అభిప్రాయ పడ్డారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ హోలీ పండుగ అందరి కుటుం బాల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు.
- Advertisement -