Tuesday, April 22, 2025

నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ఒసాకాలో
పాల్గొన్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం
గర్వకారణం తెలంగాణ, జపాన్‌ల మధ్య
ఉన్న చారిత్రక స్నేహబంధాన్ని దీర్ఘకాల
భాగస్వామ్యంగా మార్చుకుందాం కొత్త
ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికలకు
రూపకల్పన చేద్దాం తెలంగాణలో
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు
హైదరాబాద్‌కు రండి…మీ ఉత్పత్తులు
తయారు చేయండి జపాన్‌లోని ఒసాకా
వరల్డ్ ఎక్స్‌పోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: నవ ప్రపంచాన్నినిర్మిద్దామని అందులో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ వ్యాపారవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒసాకా ఎక్స్ పోలో ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రేవంత్‌రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సిఎం బృందం సోమవారం ఉదయం భారత పెవిలియన్‌లోకి అడుగుపెట్టింది.జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ఎక్స్‌పోలో రాష్ట్రానికి సంబంధించి తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను సిఎం రేవం త్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్‌పోను నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నమోదు చేసింది. ఒసాకా ఎక్స్‌పోపై వేదిక పై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతీ, అభివృ ద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావర ణం, సంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చే సందర్శకులకు చాటిచెప్పనుంది. తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్రసాంకేతిక పురోగతి,సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించిం ది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్‌పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పా లు పంచుకోవటం గర్వంగా ఉందని ఆయన పే ర్కొన్నారు. తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలి సి పనిచేద్దామన్న ఆకాంక్షను సిఎం రేవంత్ వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి..
‘హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొండి’ అని జపాన్ కంపెనీలను సిఎం తెలంగాణకు ఆహ్వానించారు. తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలున్నాయని, ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు. తెలంగాణతో పాటు ఒసాకా, ప్రపంచంతో కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్‌ను నిర్మిద్దామని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు.

ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణకు ప్రత్యేకమైన గుర్తింపు: మంత్రి శ్రీధర్‌బాబు
ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ రంగాల పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను ఆయన వివరించారు. హైదరాబాద్ లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీపై ఈ సిటీ ఆధారపడుతుందన్నారు. జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్ ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రీయల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్లతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌కు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)ల మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్,

ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందన్నారు. ఎగుమతులకు వీలుగా సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్భన్ గ్రీన్ వేను అభివృద్ధి చేసేందుకు టోక్యో, ఒసాకా నగరాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్‌ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News