పిఎంఎవై2.0 కింద చేరిన తొలి రాష్ట్రం తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి
సమగ్రమైన డేటా, ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి మెట్రో ఫేజ్2ను జాయింట్
వెంచర్గా చేపట్టాలి మురుగునీటి నెట్వర్క్ నిర్మాణానికి రూ.17,212కోట్లు
ఇవ్వండి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పనులకు రూ.55వేల కోట్ల ఆర్థిక
సాయం చేయండి పిఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించండి
మూసీ పునరుజ్జీవనానికి రూ.10వేల కోట్లు మంజూరు చేయండి
కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వినతి
దావోస్లో పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించిన రేవంత్ను
అభినందించిన కేంద్రమంత్రి మనోహర్లాల్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్భన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మా ణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లా ల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చే శారు. దేశ పట్టణ జనాభాలో 8 శాతం ప్రజ లు తెలంగాణలో ఉన్నారని కేంద్ర మంత్రికి సిఎం తెలియజేశారు. పిఏఎంవై (యూ) పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల పై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం సమీక్ష ని ర్వహించారు. పిఎంఏవై 2.0 లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డేటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉ న్నందున రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మం జూరు చేయాలని కేంద్ర మంత్రిని సిఎం కో రారు. దేశంలోని మహా నగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్లో మె ట్రో కనెక్టవిటీ తక్కువగా ఉందని ఈ నేపథ్యం లో మెట్రో ఫేజ్- 2 కింద ఆరు కారిడార్లను గు ర్తించామని కేంద్ర మంత్రి మనోహర్లాల్తో సిఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
76.4 కి.మీల డిపిఆర్లు పూర్తి
మెట్రో ఫేజ్- 2 కింద రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి న కారిడార్లకు సంబంధించిన వివరాలు ఇ లా ఉన్నాయి. నాగోల్- టు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.)లు, రాయదుర్గం-టు కోకాపేట నియోపొలిస్ (11. 6 కి.మీ.)లు, ఎంజీబిఎస్ టు -చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.)లు, మియాపూర్- టు పటాన్చెరు (13.4 కి.మీ.)లు, ఎల్ బి నగర్- టు హయత్ నగర్ (7.1 కి.మీ)లు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం- ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) (40 కి.మీ.)లను గుర్తించామని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో మొదటి అయిదు కారిడార్లకు సంబంధించి (76.4 కి.మీ.) డిపిఆర్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయమవుతుందని సిఎం పేర్కొన్నారు. డిపిఆర్లు ఆమోదించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం (జేవి) కింద చేపట్టి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు చేయూత నివ్వాలని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీలో మురుగు చేరకుండా నదికి ఇరువైపులా 55 కి.మీ. (మొత్తంగా 110 కి.మీ.) కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపిల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, దీనికోసం రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు.
మురుగునీటి నెట్వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో….
నగరంతో పాటు సమీపంలోని 27 పట్టణ పాలక సంస్థల పరిధిలో మురుగునీటి నెట్వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ (సిఎస్ఎంపి) తయారు చేశామని కేంద్ర మంత్రికి సిఎం వివరించారు. అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా సిఎస్ఎంపిని గుర్తించి నిధులు సమకూర్చాలని కేంద్ర మంత్రి ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను నోటిఫై చేసిందని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. వరంగల్ నగరంలో రూ.41,70 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడి) పథకాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు.
గ్రేటర్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రూ. 55,652 కోట్ల ఆర్థికసాయం
గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 55,652 కోట్ల ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పురపాలక వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ కట్టర్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 65 శాతం భూభాగం అర్బన్ ఏరియా కింద ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా పురపాలికల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. అటల్ మిషన్ ఫర్ రెజ్యూవే నేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అమృత్, అర్భన్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, స్వచ్ఛభారత్ మిషన్ 2.0, స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్, స్మార్ట్ సిటీ మిషన్, పిఎం స్వానిధి కేంద్ర సౌజన్య పథకాల ప్రగతికి గురించి సిఎం వివరించారు. పెండింగ్ పనుల పూర్తికి నిధులను మంజూరు చేయాలని సిఎం రేవంత్రెడ్డి కేంద్రమంత్రిని కోరారు. దావోస్లో రికార్డు స్థాయిలో ఒప్పందాలపై సిఎంను కేంద్ర మంత్రి ప్రశంసించారు.
పిఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించండి..
రాష్ట్రంలోని గిరిజన రైతులకు నిరంతరం సాగునీరు అందించేందుకు వీలుగా పిఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కుసుమ్ -సిఎఫ్ఎల్ఎస్ కాంపొనెంట్ కింద 2,500 మెగావాట్లను కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యుత్ సరఫరా, నెట్వర్క్ బలోపేతానికి రూ.488 కోట్ల అంచనా వ్యయంతో 9 ప్రాజెక్టు నివేదికలను కేంద్రానికి సమర్పించామని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సిఎం, డిప్యూటీ సిఎంలు కోరారు. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో తెలంగాణ డిస్కమ్లను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్సీ), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ఇచ్చిన రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లను తగ్గించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కొత్త పునరుత్పత్తి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి రెండు సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని అందువల్ల ఆర్పీపీఓ లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకు విధించే జరిమానాలు మాఫీ చేయాలని కేంద్ర మంత్రిని వారు కోరారు. పునరుత్పత్తి విద్యుత్ నిర్వహణ కేంద్రాల అప్గ్రేడేషన్కు అవసరమయ్యే నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్, ప్రజాసంబంధాలు) హర్కర వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాస రాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.