ట్రిపుల్ ఆర్ పనులు వేగవంతం చేయాలి హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేపై
దృష్టి సారించాలి ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగం భూసేకరణ పూర్తి చేయాలి దక్షిణ భాగం
డిపిఆర్ కన్సల్టెన్సీ నివేదిక త్వరలో రూపొందించాలి హైదరాబాద్మంచిర్యాల జాతీయ
రహదారి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి సమీక్షా సమావేశంలో సిఎం రేవంత్ దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్కు రూపకల్పన చేయాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ సమీపంలో సరైన ప్రాంతంలో డ్రైపోర్ట్ ఉండాలని సి ఎం ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మా ణం, ఆర్ఆర్ఆర్ పనుల పురోగతిపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర పునర్విభజన అంశాలపై ఢిల్లీలో జరిగిన తెలంగాణ, ఎపి అధికారుల సమావేశంలో హైదరాబాద్ టు -విజయవాడ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అవసరమైన డిపిఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమో దం తెలపాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశించిన నేపథ్యంలో ఆ పనులపై దృష్టిసారించాలని సిఎం అధికారులకు సూచించారు. రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని, దక్షిణ భాగం డిపిఆర్ కన్సల్టెన్సీ నివేదికను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ను ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు (ఎన్హెచ్ఏఐ) పంపించాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొ త్త జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సిఎం ఆరా తీశారు. పలు చోట్ల పంటలు ఉన్నాయని, పంట నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్హెచ్ఏఐ అంగీకరించడం లేదని అధికారులు సిఎంకు వివరించారు. పంట కాలం దాదాపు పూర్తవుతున్నందున ఆ వెం టనే రైతులతో మాట్లాడి భూ సేకరణ పూర్తి చేయాలని సి ఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భూ సేకరణకు సంబంధించి ఏవై నా సమస్యలుంటే ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకం గా మాట్లాడాలని, సాంకేతిక, న్యాయ సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని సిఎస్ శాంతి కుమారికి సిఎం సూచించారు.
ఔటర్ రింగ్రోడ్డు నుంచి రీజనల్ రింగ్రోడ్డు వరకు రేడియల్ రోడ్లు ఆర్ఆర్ఆర్ నుంచి తెలంగా సరిహద్దుల వరకు ఉన్న రహదారుల విస్తరణపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమీక్షలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్ర భుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ తదితరులు పాల్గొన్నారు.