Thursday, April 10, 2025

ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

గనుల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని
పెంచాలి వివిధ ప్రభుత్వ
పనులు, భారీ నిర్మాణ సంస్థలకు
టిజిఎండిసి నుంచే ఇసుక సరఫరా
నగరానికి మూడువైపులా స్టాక్
పాయింట్లు పెండింగ్‌లో ఉన్న
ఖనిజాల బ్లాక్‌ల వేలానికి సత్వరమే
టెండర్లు గనులశాఖపై సమీక్షలో
సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోవాలని, ప్రభు త్వ ఆదాయాన్ని పెంచాలని సిఎం సూచించా రు. గనుల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ నివారం సమీక్ష నిర్వహించారు. నెల రోజులు గా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణా కు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సిఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌లో తవ్వకాలు, రవా ణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు టిజిఎండిసి నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టిజిఎండిసి ద్వారానే సరఫరా చేయాలని సిఎం ఆదేశించారు.

నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు
సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందన్నారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీ లకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా సిఎం అధికారులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమస్యను పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సిఎం ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టిజిఎండిసి చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ కె.శశాంక, గనుల శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్, టిజిఎండిసి ఎండి సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News