Saturday, October 5, 2024

రాహుల్ గాంధీ నామినేషన్‌లో పాల్గొన్న సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌రెడ్డి రాయ్‌బరేలీకి వెళ్లారు. శుక్రవారం రాహుల్ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అందులో భాగంగా సిఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ముఖ్యమంత్రి రాయ్‌బరేలీకి వెళ్లారు. సోనియాగాంధీ ఇటీవల రాజ్యసభ ఎంపిగా ఎంపికవ్వగా ఆమె పోటీ చేసే స్థానం రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలుస్తున్నారు. అమేథీ నుంచి కిషోర్‌లాల్ శర్మను కాంగ్రెస్ బరిలో నిలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News