Tuesday, September 17, 2024

హుస్సేన్‌సాగర్‌ కు సరికొత్త నగ

- Advertisement -
- Advertisement -

న తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్‌గా అభివృద్ధి చేయాల ని ప్రభుత్వం నిర్ణయిచింది. ట్యాంక్ బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల కు సూచించారు. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృ ద్ధి చేయాలని శనివారం జరిగిన అధికారుల స మావేశంలో రేవంత్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీ సుకున్నారు. ట్యాంక్‌బండ్ ప్రాంతాన్ని భవిష్యత్ లో వరల్డ్‌క్లాస్ టూరిజం హబ్ గా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూనా డిజైన్లు తయారు చేయించాలని సూచించారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.

బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం
దేశ విదేశాల్లోని బుద్దిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీ లో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్‌లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సిఎం సంకల్పించారు. కేంద్రం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్‌లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డిపిఆర్‌ను పంపించిందని సిఎం తెలిపారు. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించిందని సిఎం పేర్కొన్నారు. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం ను ఈ ప్రణాళికలో పొందుపరుచనున్నట్టు రేవంత్ అధికారులతో తెలిపారు. అందులో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిర్చువల్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామన్నారు.

హైదరాబాద్- టు నాగార్జున సాగర్ ఫోర్ లేన్ రోడ్డు
నాగార్జున సాగర్ డ్యామ్ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సిఎం సంకల్పించారు. నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్‌లో విహారించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని సిఎం నిర్ణయించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందిస్తారని సిఎం తెలిపారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్డు నిర్మిస్తారు. ఈ రహదారికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను సిఎం ఆదేశించారు.

గోల్కొండ చుట్టూ అక్రమ నిర్మాణలు తొలగింపు
అదేవిధంగా గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా అయ్యాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని సిఎం నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడ నివసించే వారు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సిఎం సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News