Sunday, September 22, 2024

స్కిల్ వర్శిటీ పరిధిలోకి ఐటిఐలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మార్కెట్ అవసరాలకు అనుగుణమైన ఐటీఐ కోర్సులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు ఓ కమిటీని నియమించి, నిపుణులు, విద్యావేత్తలు సలహాలు, సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐటీఐ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాలని, శిక్షణ తీసుకుంటున్న వారికి సమగ్రమైన శిక్షణ అందేలా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. ఐటీఐ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీలు క్రమం తప్పకుండా చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు.

పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ కొత్త ఏటిసిలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ, ఏటిసిలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ, ఏటిసి, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి, విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News