Sunday, September 8, 2024

దశాబ్ది ఉత్సవాలకు కెసిఆర్‌కు సిఎం రేవంత్ ప్రత్యేక ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యమకారులతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు కూడా ఆహ్వానం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కెసిఆర్‌కు ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కెసిఆర్‌కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు. కెసిఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని సిఎం రేవంత్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News