Thursday, September 19, 2024

నేడు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం 3.45 గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌ఎలు, ప్రభుత్వ సలహాదారులు,గ్రేటర్ హైదరాబాద్ మేయర్, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News