Saturday, September 28, 2024

విచారణ అధికారికి ముందస్తు అభిప్రాయాలు ఉండకూడదు: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విచారణ కమిషన్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఎలాంటీ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేకుండా ఏ విచారణ అధికారి అయినా విచారణ జరపాలని అన్నారు. విచారణ అధికారికి ఎలాంటి ఉద్దేశాలు, ముందస్తు అభిప్రాయాలు ఉండకూడదన్నారు. ఇదిలావుంటే విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ ముందే పలు విషయాలను వెల్లడించిందన్నారు. విద్యుత్ ఒప్పందాల్లో తమ పూర్వ ప్రభుత్వానికి ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నది ప్రజలకు తెలుసునన్నారు.

తెలంగాణ విద్యుత్ కొరత సమస్యను పరిష్కరించేందుకే ఒప్పందాలు చేసుకున్నామని ప్రజలకు తెలుసునన్నారు. నాటి సమైక్య వాదులు తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని బూచి చూపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ హయాంలో ఇరవై నాలుగు గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News