Saturday, October 5, 2024

మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పిఎస్‌లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై గురువారం బిఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులను కోరారు. మంత్రి కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు వెనక్కి తీసుకొని.. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి బుధవారం చేసిన ఈ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వారు విమర్శించారు.

వెంటనే అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యాలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో టాలీవుడ్‌లోని అగ్ర హీరోలు సైతం వెంటనే ఆ వ్యాఖ్యలపై స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వారంతా ముక్తకంఠంతో ఖండించారు.ఈ క్రమంలోనే కొండా సురేఖ గురువారం మీడియా ముందుకు వచ్చి.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గదేలేదని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News