Thursday, February 6, 2025

ఆర్జే శేఖర్ బాషాపై మరో కేసు

- Advertisement -
- Advertisement -

బిగ్‌బాస్ ఫేమ్, ఆర్‌జే శేఖర్ బాషాపై నార్సింగి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే రాజ్‌తరుణ్ భార్య లావణ్య రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గురువారం షష్టి వర్మ తన వ్యక్తిగత కాల్ రికార్డింగ్‌ను లీక్ చేశాడని శేఖర్ భాషాపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శేఖర్ భాషాపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై షష్టి వర్మ గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్ రికార్డు లీక్ చేశాడని షష్టి వర్మ ఫిర్యాదులో పేర్కొంది. తన పరువుకు భంగం వాటిల్లేలా , కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో మాట్లాడుతున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ప్రైవేటు కాల్ రికార్డ్‌లు లీక్ చేశాడని పేర్కొన్నారు.

శేఖర్ బాషా తన వ్యక్తిగత మొబైల్‌తో పాటు, అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది. శేఖర్ బాషాపై బీఎన్‌ఎస్ యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శేఖర్ బాషాపై లావణ్య ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. లావణ్యను ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ కేసులో ఇరికించాలని ఇటు మస్తాన్ సాయి, శేఖర్ బాషా ప్రయత్నం చేశారంటూ ఓ ఆడియో పోలీసులకు ఇవ్వడంతో శేఖర్ బాషాపై కేసు నమోదు అయ్యింది. ఈలోపే శేఖర్ బాషాపై మరో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. గతంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శేఖర్ బాషాపై ఓ కేసు నమోదు అయ్యింది. లక్ష్మీ పడాల్ అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శేఖర్ బాషాపై ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు అయ్యాయి. ఈ మూడు కేసులకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. లావణ్య కేసులో శేఖర్ బాషాను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News