Sunday, February 23, 2025

అసెంబ్లీ ముట్టడికి యత్నం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పలు డిమాండ్‌లతో అసెంబ్లీ ముట్టడికి శుక్రవారం పలు సంఘాలు పిలుపునిచ్చాయి. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ సెకండ్ ఏఎన్‌ఎంలు, గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వేలాది మంది కార్యకర్తలు దఫాలుగా అసెంబ్లీ వద్దకు చేరుకునేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పలు సంఘాలకు చెందిన కార్యకర్తలు ముట్టడికి పిలుపు ఇవ్వడంతో భారీగా పోలీసులను మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News