Friday, September 20, 2024

ఖమ్మంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభ విజయవంతం కావడం, సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని చేసిన ప్రసంగంపై బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. రెండు పార్టీల నేతలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్మించుకున్నారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం కామేపల్లి మండలంలో పండితాపురంలో రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కార్యకర్తల పరస్పర దాడుల్లో పలువురు గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Also Read: సెప్టెంబరు 17న కాంగ్రెస్ మేనిఫెస్టో !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News