Friday, September 20, 2024

కరోనాతో కాంగ్రెస్ ఎంఎల్ఎ మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. రాజ్‌ఘఢ్ జిల్లాలోని బియోరా నియోజకవర్గం ఎంఎల్‌ఎ గోవర్ధన్ డాంగీకి ఆగష్టు 25న కరోనా పాజిటివ్ వచ్చింది. భోపాల్‌లోని చిరాయు మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటుండగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స మంగళవారం ఉదయం చనిపోయారు. డాంగీ మృతిపట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంతాపం వ్యక్తం చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పది మంది మంత్రులు, 28 మంది ఎంఎల్‌ఎలు కరోనా వైరస్ సోకిన వారిలో ఉన్నారు. గోవర్ధన్ మృతితో మధ్యప్రదేశ్‌లో శాసనసభలో 28 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 28 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News