Sunday, July 7, 2024

కెసిఆర్ పాలనలో మనం తినే తిండి శుభ్రమైనదేనా?… కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్టర్ పేజీపై ఆసక్తికర ట్వీట్ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కోటికి పైగా జనాభా ఉంది, మెజారిటీ మధ్య తరగతి ప్రజలు ఉదయం లేస్తే ఉద్యోగ బాధ్యతల కోసం ఉరుకులు పరుగులు తీస్తారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో అద్దాల మేడలు, రంగుల గోడలు చూసి మురిసిపోయామని, రియల్ ఎస్టేట్ బిల్డర్లు వ్యాపారం కోసం కట్టుకున్న ఆకాశహార్మ్యాలను చూసి ఆహా అభివృద్ధి అంటే ఇదీ అని సంబర పడ్డామని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లాంటి లీడర్ ఉండటం వల్లే ఇదంతా అని జబ్బలు చరుచుకున్నామని, పొద్దున్నే లేస్తే మనం ఏం తాగుతున్నాం ఏం తింటున్నాం, మనం తినే తిండి శుభ్రమైనదేనా? హోటల్స్, రెస్టారెంట్లు పరిశుభ్రత పాటిస్తున్నాయా? అనేది ఎప్పుడు చెక్ చేయలేదు.

అలాంటి ఆహారం తింటే మన ఆరోగ్యం పరిస్థితి ఏంటి!? ఆ చెడిపోయిన ఆహారం తిని మనకు రోగాలు వస్తే ఆసుపత్రులు మనం చెల్లించుకునే మూల్యం ఎంత!? ఇదంతా ఆలోచించామా…!! పదేళ్లు ఒక్క రెస్టారెంట్ మీద కానీ, ఒక్క హోటల్ మీద కానీ, ఒక్క మెడికల్ షాప్ లపై ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేయడం కానీ నియంత్రణ చేస్తున్నారని కానీ విన్నామా… చూశామా!? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. గడచిన ఆరు నెలల్లో వారానికి సగటున రెండు మూడు వార్తలు, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఇన్ స్పెక్షన్ల గురించి వింటున్నామని, దీంతోనే అంతా ఐపోతుందని కాదు అని, కనీసం వ్యవస్థలు పని చేస్తున్నాయన్న నమ్మకం వస్తోందని, అభివృద్ధి అంటే అంబేద్కర్ చెప్పినట్టు అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు అని, ప్రజలు స్వేచ్ఛగా, హాయిగా, నాణ్యమైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితి ఉండటమనేది ముఖ్యమని, ప్రతీ హైదరాబాదీ ఆలోచన చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News