Sunday, February 23, 2025

ఉమ్మడి ఎపిలో అత్యంత వెనకబడిన జిల్లా ఆదిలాబాద్

- Advertisement -
- Advertisement -

బెల్లంపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనకబడిన జిల్లా ఆదిలాబాద్ అని టిపిసిసి రేవంత్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభలో రేవంత్ మాట్లాడుతూ… తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత అత్యంత వెనకబడిన జిల్లా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ అని రేవంత్ ఆరోపించారు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ పనులు ప్రారంభించిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వరకు మార్చారని చెప్పారు. 38 వేల 500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరాన్ని లక్షా 51 వేల కోట్లకు పెంచారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News