Friday, June 28, 2024

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్, నివేదితపై గెలుపొందారు. దీంతో  అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65 చేరితే, బిఆర్ఎస్ బలం 38కి జారింది. ఇదిలావుండగా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బిఆర్ఎస్ ఏదీ గెలవకుండా శూన్య స్థానానికే పరిమితమైంది. బిఆర్ఎస్ మెదక్ పై ఆశ పెట్టుకున్నప్పటికీ అక్కడ కూడా బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు భారీ మెజార్టీతో ముందుకు దూసుకెళుతున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News