Wednesday, October 16, 2024

కార్యకర్తల అత్యుత్సాహం వల్లే కొండా సురేఖ, రేవూరిల వివాదం

- Advertisement -
- Advertisement -

ఆ నేతల మధ్య ఎలాంటి వివాదం లేదు
టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్:  కొండా సురేఖ, రేవూరి వివాదంపై టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వారిద్దరి మధ్య జరిగిన వివాదం తన దృష్టికి వచ్చిందని, అయితే ఇది కార్యకర్తల అత్యుత్సాహంతో వచ్చిన సమస్యే కానీ, నేతల మధ్య ఎలాంటి వివాదం లేదని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే రేవూరి ప్రభాకర్ రెడ్డితో కూడా తాను మాట్లాడానని, చర్చలతో వివాదం ముగిసిందని ఆయన ప్రకటించారు.

అయితే గీసుకొండ పిఎస్‌లో సిఐ సీటులో మంత్రి కొండా సురేఖ కూర్చున్న విషయం మాత్రం తన దృష్టికి రాలేదని, దానికి సంబంధించిన సమాచారం లేకుండా తాను మాట్లాడలేనని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాగా, దసరా రోజున కొండా సురేఖ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రేవూరి ప్రభాకర్ రెడ్డి ఫొటో లేకపోవడంతో మొదలైన రగడ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే రేవూరి వర్గీయుడిపై దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News