చెన్నై: కామంతో ఖాకీలు ప్రియుడి ముందే ప్రియురాలిపై అత్యాచారం చేసిన సంఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో జరిగింది. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పుదుచ్చేరి పర్యాటక ప్రాంతంలో కావడంతో చాలా ప్రేమ జంటలు అక్కడికి వచ్చి సేదతీరుతాయి. కడలూరుకు చెందిన ప్రేమ జంటలు సేద తీరడానికి పుదుచ్చేరికి వచ్చారు. రాత్రి కావడంతో ఆ ప్రేమ జంటలు ఓ హోటల్లో బస చేశాయి. సెక్స్ రాకెట్ నడుస్తుందనే అనుమానంతో సతీశ్, సురేష్ అనే కానిస్టేబుళ్లు హోటల్కు వచ్చి గదుల్లో ఉన్న ప్రేమ జంటల వివరాల అడిగి తెలుసుకుంటున్నారు. అమ్మాయి గురించి తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించడంతో ప్రేమ జంట భయపడి పోలీసులకు 20 వేల రూపాయలు లంచం ఇచ్చారు. మరో ప్రేమ జంట దగ్గర డబ్బులు లేకపోవడంతో ప్రియుడి ముందు ప్రియురాలిపై ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. కానిస్టేబుళ్ల వ్యవహారం బయటకు రావడంతో ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేయడమే కాకుండా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.