Sunday, February 23, 2025

హనుమకొండలో అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

వరంగల్: హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కానిస్టేబుల్ ప్రసాద్ తన అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. తన కాపురంలో అత్త చిచ్చు పెడుతుందనే అనుమానంతోనే ఆమెను అల్లుడు హత్య చేసినట్టు సమాచారం. అల్లుడు అత్తకు నాలుగు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో అల్లుడికి-అత్తకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News