Friday, September 20, 2024

ఇండిగో, ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు జరిమానా

- Advertisement -
- Advertisement -

విమానంలో వస్తువులు గల్లంతైన విషయంలో ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలైన ఇండిగో, ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. రూ.3.72 లక్షల జరిమానా చెల్లించాలని ఈ రెండు సంస్థలను ఆదేశించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టిఎస్ ఈఆర్సీ) చైర్మన్ రంగారావు గత జూలైలో అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. అదే నెల 30వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి దోహా అటు నుంచి హైదరాబాద్ వచ్చేలా టికెట్ బుక్ చేసుకున్నారు.

ఈ క్రమంలో తన బ్యాగులో విలువైన వస్తువుల విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేయగా మీ వస్తువులు ఎక్కడా తప్పిపోకుండా తాము క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకువస్తామని ఇండిగో హామీ ఇచ్చింది. దీంతో వారి మాటలపై భరోసాతో 32 కేజీల బరువు కలిగిన బ్యాగులో రూ. 3.54 లక్షల విలువ కలిగిన బట్టలు, ఆహార వస్తువులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికాలతో కూడిన బ్యాగ్‌ను టిఎస్ ఈఆర్సీ చైర్మన్ రంగారావు వారికి అప్పగించారు. తీరా రంగారావు హైదరాబాద్ చేరుకునే సరికి ఆ బ్యాగ్ మిస్ అయింది. దీంతో ఈ ఘటనపై ఆయన వినియోగదారులను ఆశ్రయించగా దీనికి ఎయిర్‌లైన్స్ బాధ్యత వహించాలని పేర్కొంటూ కమిషన్ జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News