Thursday, October 24, 2024

బిజెపి ఎంఎల్‌ఎ పుట్టిన రోజు వేడుకలో ఘర్షణ

- Advertisement -
- Advertisement -

Controversy in BJP MLA's birthday party

దామోహ్ (ఎంపి): మధ్యప్రదేశ్ దామోహ్ జిల్లాలో బిజెపి ఎంఎల్‌ఎ పుట్టిన రోజు వేడుక సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇద్దరు హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బన్వర్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని దామోహ్ ఎస్‌పి హేమంత్ చౌహాన్ చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హతుల్లో ఒకడైన జోగేంద్ర సింగ్ (30) తుపాకీ కాల్పులకు బలి కాగా, మరో హతుడు అర్వింద్ జైన్ చావు దెబ్బలు తిని చనిపోయాడని ఎస్‌పి చెప్పారు. అయితే జబేరా ఎంఎల్‌ఎ ధర్మేంద్ర సింగ్ లోఢి ఆ వేడుకలో పాల్గొనలేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి. జైన్ ఎంఎల్‌ఎకు ప్రతినిధిగా ఆ వేడుకలో పాల్గొన్నారు. సింగ్ అతిధిగా వచ్చిన ఉపాధ్యాయుడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News