Sunday, September 22, 2024

విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా: ఈటెల

- Advertisement -
- Advertisement -

Etela rajender

 

హైదరాబాద్: ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో ఈటెల మీడియాతో మాట్లాడారు. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరోనా వ్యాధి గ్రస్తులు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. పార్కలు, మాల్స్, వేడుకలకు దూరంగా ఉండండి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరికి వారు పరిశుభ్రంగా ఉండండని, ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని దేశాలు కరోనాపై హై అలర్ట్ ప్రకటించాయన్నారు. అన్ని కార్యాలయాల్లో శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News