- Advertisement -
చెన్నై: కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని మదురై ప్రాంతం తిరుపరణ్కుంద్రమ్లో ఆదివారం జరిగింది. పాళంగానాథామ్ గ్రామానికి చెంది ధనుష్కోడికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కరోనా వైరస్ సోకిందని తెలియగానే ఆస్పత్రి భవనంలో మొదటి ఫ్లోర్ నుంచి దూకాడు. వెంటనే అతడిని దగ్గరలో ఉన్న రాజాజీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధనుష్ చనిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -