తిరువనంతపురం: కరోనా వైరస్ సోకిన 19ఏళ్ల అమ్మాయిపై అంబులెన్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన కేరళ రాష్ట్రంలోని పఠనమిట్ట జిల్లా పంథాల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే… పంథాల ప్రాంతానికి చెందిన యువతికి కోవిడ్ లక్షణాలు ఉండడంతో క్వారంటైన్లో ఉంది. అక్కడ టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తెలింది. యువతితో పాటు మరొకరికి పాజిటివ్ రావడంతో కరోనా ఐసోలేషన్ కేంద్రానికి తీసుకుపోవడానికి 108 అంబులెన్సు వచ్చింది. దాని డ్రైవర్ నౌఫాల్ (25) ఇద్దరిని అంబులెన్స్ ఎక్కించుకోని ఒకరిని ఓ ఆస్పత్రి దగ్గర దించాడు.
మరో యువతిని మరో ఐసోలేషన్ కేంద్రానికి తరలించాల్సిఉంది. ఈ మార్గమధ్య సమయంలోనే అంబులెన్సును ఆపి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో ఆమెను ఐసోలేషన్ కేంద్రం దగ్గర దింపి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె శైలజ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Corona patient raped by ambulance driver in Kerala