Saturday, September 21, 2024

భారత్ లో 40 లక్షలు దాటిన కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

Coronavirus india cases state wise

 

హైదరాబాద్: భారత్‌లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే 86,432 కేసులు నమోదు కాగా 1089 మంది చనిపోయారు. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 40.23 లక్షలకు చేరుకోగా 69561 మంది మరణించారు. ఇవాళ సాయంత్రం వరకు కరోనా కేసుల సంఖ్యలో బ్రెజిల్‌ను దాటేస్తే భారత్ రెండో స్థానంలోకి చేరుకుంటుంది. భారత్ లో ఇప్పటి వరకు 4.77 కోట్ల మంది టెస్టులు చేశామని ఐసిఎంఆర్ వెల్లడించింది. గత 24 గంటల్లో 10,59,346 మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఎపిలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. 63.89 లక్షలతో అమెరికా తొలి స్థానంలో ఉండగా బ్రెజిల్ 40.91 లక్షలతో రెండో స్థానం, 40.23 లక్షలతో ఇండియా మూడో స్థానంలో ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News