Sunday, September 8, 2024

హైకోర్టు ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Couple commit suicide before high court

అమరావతి: హైకోర్టు ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో దేవేంద్రరావు-భానుశ్రీ దంపతులు నివసిస్తున్నారు. వారు ఉంటున్న ఇల్లు బస్ షెల్టర్ నిర్మించేందుకు స్థానిక నేతలు ప్రయత్నించగా వారు హైకోర్టు మెట్లు ఎక్కారు. హైకోర్టు ఆ దంపతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును లేక్కచేయకుండా ఇల్లును కూలగొడుతామని ఆ దంపతులను హెచ్చరించిడంతో మానసిక క్షోభకు గురి చేశారు. దీంతో వారు హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా వారిని పోలీసుల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి పోతురాజు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News